Etela Rajender : ఈ సారి సీఎం కేసీఆర్కు ఓటు వేస్తే మన బతుకులు అగమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో గెలిచి తీరాలని ప్రధాని మోడీ సీరియస్ గా ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీల నాయకులు పార్లమెంట్ లో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసిఆర్ కే వెళ్తుందని, తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే చిల్లర ఆరోపణ చేసి తనను బిఆరెఎస్ పార్టీ నుండి బయిటికి పంపారన్నారు. రాత్రి పగలు కష్టపడి తెలంగాణలో పార్టీని గెలిపించాలని వరంగల్ సభలో ప్రధాని మోడీ, జెపి నడ్డ చెప్పారు, సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే తన కర్తవ్యమన్నారు ఈటల రాజేందర్.
Also Read : Renuka Chowdhury : దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారు
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా పంచని సీఎం కేసిఆర్ ఎం మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వస్తాడని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇంట్లో ఇద్దరు వృద్దులు ఉంటే వారిద్దరికీ పెన్షన్ లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరిట 25 వేల కోట్ల రూపాయలు మన చేతిలో పెట్టి, గల్లి గల్లీలో బెల్ట్ షాపులు నడుపుతూ సంవత్సరానికి 45 వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద 8 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సారి సీఎం కేసిఆర్ కు ఓటు వేస్తే మన బతుకులు అగమేనని, ధనిక రాష్టం, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 లో రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదన్నారు.
Also Read : Renuka Chowdhury : దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారు
తాజావార్తలు
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
-
Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్కు బ్రాండ్ అంబాసిడర్!
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..