Corona: తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా 155 కేసులు
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తం అయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 155 మంది మహమ్మారి బారిన పడ్డారు. 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు చేశారు. 24 మంది కోలుకోగా.. 907 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్

జిల్లాలతో పోలిస్తే రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో 81 హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే.. కరోనా ప్రారంభం అయిప్పటి నుంచి 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం పెరిగాయి. గత వారంలో తెలంగాణలో 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో వారం వ్యవధిలో 811 కరోనా పాజిటివ్ కేేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!