Corona: తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా 155 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తం అయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 155 మంది మహమ్మారి బారిన పడ్డారు. 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు చేశారు. 24 మంది కోలుకోగా.. 907 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్

జిల్లాలతో పోలిస్తే రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో 81 హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే.. కరోనా ప్రారంభం అయిప్పటి నుంచి 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం పెరిగాయి. గత వారంలో తెలంగాణలో 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో వారం వ్యవధిలో 811 కరోనా పాజిటివ్ కేేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?