Corona: తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా 155 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తం అయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 155 మంది మహమ్మారి బారిన పడ్డారు. 24 గంటల్లో 16,319 కరోనా పరీక్షలు చేశారు. 24 మంది కోలుకోగా.. 907 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!

జిల్లాలతో పోలిస్తే రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో 81 హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల వివరాలను పరిశీలిస్తే.. కరోనా ప్రారంభం అయిప్పటి నుంచి 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,166 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం పెరిగాయి. గత వారంలో తెలంగాణలో 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో వారం వ్యవధిలో 811 కరోనా పాజిటివ్ కేేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!