Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను పార్టీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బీజేపీ బాధ్యతలు అప్పగించింది.
ఈనేపథ్యంలో బండి సంజయ్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
Read also: Mukesh Kumar Debut: వికెట్ ఏమీ పడగొట్టకున్నా.. రెండో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ అరుదైన రికార్డు!
Also Read
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
- Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
కాగా బండి సంజయ్ హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు, బండి అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి జయతి విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఎస్ఆర్ క్లాసిక్ గార్డెన్స్కు వెళతారు. సాయంత్రం శంషాబాద్లోని ఎస్సార్ క్లాసిక్ గార్డెన్స్లో బండి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళిక రచించడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ లక్ష్యంలో భాగంగా, పార్టీలో సంస్థాగత మార్పులు ప్రారంభించబడ్డాయి, ఇది అనేక రాష్ట్రాలలో అధ్యక్షులను భర్తీ చేయడానికి దారితీసింది. ఏపీ రాజకీయాల్లోనూ బండి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Read also: Top Headlines@1PM: టాప్ న్యూస్
బండి సంజయ్ నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే వ్యూహంతో బీజేపీ నాయకత్వం ముందుకు సాగనుంది. ఈ మేరకు పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చారు. తెలంగాణ, ఏపీ సహా మరో రెండు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఈ ఏడాది జూలై నెలలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది భాజపా అధ్యక్షులతో సమావేశమయ్యారు. దక్షిణాదిలో పార్టీ విస్తరణ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దక్షిణాదిలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎంపీ సీట్లు దక్కించుకోవడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.
Game Changer: ఇండిపెండెన్స్ డే రోజైనా టీజర్ రిలీజ్ చేస్తారా?
- Tags
- bandi sanjay
- BRS
- Delhi
- hyderabad
- TBJP
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..