Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తు్న్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అయితే, ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్లో షేర్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు..? మీతో ఉన్న వ్యక్తులు ఎవరు..? ’’ అని ప్రశ్నించారు.
“రాహుల్ జీ, ఈ ఫొటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? ఈ ఫొటోలో మీతో ఉన్న వ్యక్తులు ఎవరు? తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది” అంటూ గిరిరాజ్ సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి బీజేపీ గత కొంత కాలంగా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నేత ఆచూకీ లేకుండా కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్తుండటాన్ని ప్రశ్నిస్తోంది.
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ఈ ఫోటోపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీతో ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి ఆయన స్నేహితుడి భార్య, కుమారుడని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపింది. అయితే రాహుల్ స్నేహితుడు ఫొటోలో లేరని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సప్రియా శ్రీనేత్ గిరిరాజ్ సింగ్పై తీవ్రంగా స్పందించింది. మహిళ, పరుషుడుతో కలిసి ఉన్న ఫోటోను చూసి అసభ్య ఆలోచనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఫోటో టెక్సాస్లోని లేక్ రే రాబర్ట్స్లో తీసిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ అవి దండియా వెల్లడించారు.
గత కొంత కాలంగా రాహుల్ విదేశీ పర్యటనలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 22 నుంచి జూలై 13 వరకు రాహుల్ గాంధీ విదేవీ పర్యటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఎవరిని కలిశారు? ఆ ప్రమాణ ఖర్చులు, వసతి ఎవరు భరించారు? అని ప్రశ్నించారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు అమీత్ సతామ్, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత్కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కలిశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..