Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తు్న్న ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అయితే, ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్లో షేర్ చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు..? మీతో ఉన్న వ్యక్తులు ఎవరు..? ’’ అని ప్రశ్నించారు.
“రాహుల్ జీ, ఈ ఫొటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? ఈ ఫొటోలో మీతో ఉన్న వ్యక్తులు ఎవరు? తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది” అంటూ గిరిరాజ్ సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి బీజేపీ గత కొంత కాలంగా ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నేత ఆచూకీ లేకుండా కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్తుండటాన్ని ప్రశ్నిస్తోంది.
Also Read
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
ఈ ఫోటోపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీతో ఫొటోలో ఉన్న మహిళ, చిన్నారి ఆయన స్నేహితుడి భార్య, కుమారుడని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లిన సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపింది. అయితే రాహుల్ స్నేహితుడు ఫొటోలో లేరని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సప్రియా శ్రీనేత్ గిరిరాజ్ సింగ్పై తీవ్రంగా స్పందించింది. మహిళ, పరుషుడుతో కలిసి ఉన్న ఫోటోను చూసి అసభ్య ఆలోచనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఫోటో టెక్సాస్లోని లేక్ రే రాబర్ట్స్లో తీసిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ అవి దండియా వెల్లడించారు.
గత కొంత కాలంగా రాహుల్ విదేశీ పర్యటనలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 22 నుంచి జూలై 13 వరకు రాహుల్ గాంధీ విదేవీ పర్యటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఎవరిని కలిశారు? ఆ ప్రమాణ ఖర్చులు, వసతి ఎవరు భరించారు? అని ప్రశ్నించారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు అమీత్ సతామ్, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత్కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కలిశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!