Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. పూర్తిగా కొత్త పాలసీని తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న లైసెన్సులనే రెన్యువల్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది.
గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.1,900 కోట్ల మేర భారీ ఆదాయం రాగా, వ్యాపారుల నుంచి 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న మార్జిన్లు తమకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని లైసెన్సుదారులు చెబుతున్నారు. కొనుగోళ్లపై కనీసం 20 శాతం మార్జిన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
మరోవైపు.. ప్రస్తుత లైసెన్సులనే రెన్యువల్ చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజు నిర్ణయించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా నగరాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల వరకు లైసెన్స్ ధరలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఫీజును వ్యాపారులకు వెసులుబాటుగా 50 శాతం చొప్పున రెండు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.
త్వరలోనే మద్యం వ్యాపారులతో నేరుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఎంత ఆదాయం సమకూరుతుందనే అంచనాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దయిన బార్ల సుదీర్ఘకాల లైసెన్సులను తిరిగి పునరుద్ధరించే అంశంపైనా కసరత్తు కొనసాగుతోంది. వీటన్నింటిపై అధ్యయనం ముగిసిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ నూతన మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!