HarishRao : జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకట్రెండు వారాల్లో మరో రెండు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీలు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని గుర్తు చేశారు. 12 మినీ హబ్స్తో ప్రజల ఆరోగ్యం, పైసలను కాపాడవచ్చని హరీశ్ రావ్ అన్నారు. వైద్యారోగ్య శాఖ గత జనవరిలో 8 మినీ హబ్స్ని శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పఠాన్ చెరువు, మలక్ పేట్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, నార్సింగి ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్స్ వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
బారస్, జంగంపేట, అంబర్పేట, పురానాపూల్, పనిపురా, శ్రీరాంనగర్, సీతాఫల్మండి, లాలాపేటలో ఇవి సేవలు అందిస్తున్నాయని, వీటిలో ఎక్స్రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నారని అన్నారు. 129 బస్తీ దవాఖాన / పీహెచ్సీ / సీహెచ్సీల నుంచి పరీక్షల కోసం రోగులు ఈ హబ్స్కు వస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి 15 నెలల్లో ఈ 8 మినీ హబ్స్లో 54,100 రోగులు రిజిస్టర్ కాగా, 60,281 పరీక్షలు చేశారు. వీటి ద్వారా పట్టణ పేదలకు రూ.4.26 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
అయితే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించాల్సిన గోల్కొండ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభం వాయిదాపడింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిదుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం వాయివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!