HarishRao : జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకట్రెండు వారాల్లో మరో రెండు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీలు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని గుర్తు చేశారు. 12 మినీ హబ్స్తో ప్రజల ఆరోగ్యం, పైసలను కాపాడవచ్చని హరీశ్ రావ్ అన్నారు. వైద్యారోగ్య శాఖ గత జనవరిలో 8 మినీ హబ్స్ని శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పఠాన్ చెరువు, మలక్ పేట్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, నార్సింగి ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్స్ వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
బారస్, జంగంపేట, అంబర్పేట, పురానాపూల్, పనిపురా, శ్రీరాంనగర్, సీతాఫల్మండి, లాలాపేటలో ఇవి సేవలు అందిస్తున్నాయని, వీటిలో ఎక్స్రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్నారని అన్నారు. 129 బస్తీ దవాఖాన / పీహెచ్సీ / సీహెచ్సీల నుంచి పరీక్షల కోసం రోగులు ఈ హబ్స్కు వస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి 15 నెలల్లో ఈ 8 మినీ హబ్స్లో 54,100 రోగులు రిజిస్టర్ కాగా, 60,281 పరీక్షలు చేశారు. వీటి ద్వారా పట్టణ పేదలకు రూ.4.26 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
అయితే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించాల్సిన గోల్కొండ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభం వాయిదాపడింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిదుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమం వాయివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!