పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు పోలీసుల బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్…
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ (GHMC) విడుదల చేసిన గణాంకాలు నిర్మాణ రంగంలో వస్తున్న వేగాన్ని, పారదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 17,957 నిర్మాణ , లేఅవుట్ అనుమతులను మంజూరు చేసినట్లు జీహెచ్ఎంసీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్చి 2025లో అధికారికంగా ప్రారంభించిన ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారా ఈ అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా…
హైదరాబాద్ నగరంలోని కీలకమైన ఇందిరా పార్కులో అక్రమ ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) కఠిన చర్యలు చేపట్టింది. వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో జీహెచ్ఎంసీ విఫలమైన చోట హైడ్రా తనదైన శైలిలో స్పందించి పార్కు స్థలాన్ని పునరుద్ధరించింది. ఇందిరా పార్కులో కొత్తగా స్కేటింగ్ రింగ్ను ఏర్పాటు చేయడంతో, పాత స్కేటింగ్ రింగ్ ఉన్న స్థలం ఖాళీగా…
హైదరాబాద్ నగరంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడంతో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనున్న నేపథ్యంలో.. ఈ నెల మార్చి 31వ తేదీలోగా తమ ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే వారికి వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ…
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి…
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ వాసులతో కలిసి గల్లీల్లో కలియ తిరిగారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బస్తీల్లో జనాభా వేగంగా పెరుగుతోందని, ప్రతిరోజూ కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయని తెలిపారు.…
గ్రేటర్ హైదరాబాద్ను మూడుగా విభజించడం వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఉన్నాయా? ఆ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎందుకు మండిపడుతోంది? ఇవిగో…. ఇవీ… మీ ఉద్దేశ్యాలంటూ వేటిని ఎత్తి చూపుతోంది కాషాయ దళం? మూడు చోట్ల తమ బలం విషయంలో ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ను మూడుగా పునర్విభజన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 300 వార్డ్లు, మూడు కార్పొరేషన్స్గా రూపు మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను కొనసాగిస్తూనే….…
యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూశారు. రామ్ కి యాజమాన్యం నిర్లక్ష్యం చెత్త సేకరణ కార్మికుడు దుర్మరణం చెందాడని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై…
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్లో మరో స్టడీ టూర్కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి…