మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు…
నిన్న వైఎస్సాఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటన వివాదం రేపుతోంది. అయితే వైఎస్సాఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నరసరావుపేటలోని జొన్నలగడ్డలో టీడీపీనేత అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలతో ధర్నా దిగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. అయితే ధర్నా విరమించాలని అరవింద్ను పోలీసులు కోరగా అరవింద్కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.…
సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి…
కోడిపందాలు జూదం కాదు.. సంస్కృతిలో భాగమని వైసీపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆదివారం ఆయన ఏపీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కృతి, చట్టాలను రెండింటిని గౌరవించాలని, కోడి పందాలు సంప్రదాయంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు కేటాయిస్తోందిని, ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా యాజమాన్య హక్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు…
ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి…
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు…
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అయితే చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ హత్యారాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందంచిన ఎమ్మెల్యే జోగిరమేశ్ హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రజలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని,…
ఏపీలో భోగి పండుగ రోజు కూడా టీడీపీ నేతలు వారి నిరసనలు తెలపడానికి విరామం ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రజలకు నష్టకలిగించే జీవోలు ప్రవేశపెడుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రోజు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ భోగి మంటలు వేసి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అయితే కృష్ణాజిల్లాలో గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో…
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.…
ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన… ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో జగన్, పల్నాడులో పిన్నెల్లి హత్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు,…