గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు,…
గుడివాడలో క్యాసినో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానిని ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయగా… ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో క్యాసినో జరగకపోయినా జరుగుతోందని 420 గాడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడారు. కులసంఘాలను, 420 మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం…
జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆత్మకూరు లో ముందస్తు ప్రణాళికతో దాడి చేశారని, ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శిల్ప, హఫీజ్ ఖాన్, డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ కుట్రదారులుగా ఆయన అభివర్ణించారు. ఆత్మకూరులో మసీదు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారని, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మిస్తామంటే ఓర్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులు ఒప్పుకుంటేనే…
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఏపీలో…
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయం వాలంటీర్లుకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్సూరెన్స్ చేయించారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతులు మీదుగా వాలంటీర్లుకు అందజేశారు. జిల్లాలో అభివృద్ధి పథంలో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను జిల్లా కలెక్టర్ హరికిరణ్ అభినందించారు. అంతేకాకుండా రాజానగరం…
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వుంది. క్యాసినో వ్యవహారం కాక రేపుతోంది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానికి సవాళ్ళు విసురుతున్నారు. టీడీపీ నేతలు నిజనిర్దారణకు వెళ్ళగా.. వారిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమా కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. మీ కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని మంత్రి కొడాలి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖలు రాస్తూ వస్తున్న ఆయన.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని తన లేఖలో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక, గత ప్రభుత్వం…
గుడివాడలో సంక్రాంతి పండుగ రోజున మంత్రి కొడాలి నాని కి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని, టీడీపీ నిజ నిర్దారణ కమిటీ ఈ ఘటనపై వాస్తవాలను బయటపెట్టేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. నిజ నిర్దారణకు వచ్చిన తమపై దాడి పోలీసులు పట్టించుకోలేదని, డీజీపీ పనికి మాలిన వాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది.. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితితో పాటు.. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా పలు అంశాలపై చర్చ సాగగా.. కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.. కోవిడ్ నివారణా చర్యలను మంత్రివర్గానికి వివరించారు అధికారులు. ఈబీసీ…