నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలి : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా పనిచేస్తోంది. ప్రజాభిప్రాయం ఓట్లు తప్ప మరొకటి కాదని, రాజ్యాంగం సర్వోన్నతమని జగన్ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఏది చెప్పినా రాజ్యాంగం అని అనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై, రామతీర్థం ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై, అంతర్వేదిలో ఆలయ రథాన్ని తగులబెట్టిన వారిపై నేటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “వెల్లంపల్లి హిందువులకు అనుకూలమా లేక హిందూ వ్యతిరేకమా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వైస్సార్ సీపీ అన్ని ఆదాయ వనరులను లాక్కుంది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేసింది, దీని ఫలితంగా అభివృద్ధి అంతా నిలిచిపోయింది.”అని ఆయన విమర్శించారు. కుటుంబాలచే నడిచే రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ వనరుల దోపిడీలో మునిగిపోతున్నాయని ఆయన అన్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!