నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలి : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా పనిచేస్తోంది. ప్రజాభిప్రాయం ఓట్లు తప్ప మరొకటి కాదని, రాజ్యాంగం సర్వోన్నతమని జగన్ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఏది చెప్పినా రాజ్యాంగం అని అనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై, రామతీర్థం ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై, అంతర్వేదిలో ఆలయ రథాన్ని తగులబెట్టిన వారిపై నేటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “వెల్లంపల్లి హిందువులకు అనుకూలమా లేక హిందూ వ్యతిరేకమా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వైస్సార్ సీపీ అన్ని ఆదాయ వనరులను లాక్కుంది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేసింది, దీని ఫలితంగా అభివృద్ధి అంతా నిలిచిపోయింది.”అని ఆయన విమర్శించారు. కుటుంబాలచే నడిచే రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ వనరుల దోపిడీలో మునిగిపోతున్నాయని ఆయన అన్నారు.
Also Read
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
తాజావార్తలు
-
Nivin Pauly : 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న ప్రేమమ్ కాంబో
-
Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
ట్రెండింగ్
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!