పీఆర్సీ సాధన సమితి సంచలన వ్యాఖ్యలు.. ఐఏఎస్లకు వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాస్.. కానీ, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది.. ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.. రాష్ట్ర వ్యాప్తంగా డీడీవోలు 70 శాతం మేర బిల్లులు ప్రాసెస్ చేయలేదన్న ఆయన.. ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బేషజాలకు పోతోంది.. జీతాలు.. పీఆర్సీ.. ప్రతి దాంట్లోనూ కన్ఫ్యూజనే ఉందని.. సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు.
Read Also: జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ఇక, నిర్బంధ వేతన సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ… డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామంటూ మెమోలు జారీ చేయడం సరికాదన్న ఆయన.. క్రమశిక్షణను ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకోవాలి తప్ప.. కోపం వస్తే చర్యలు తీసుకోవడం కుదరదన్నారు.. మరోవైపు, ఏపీలో కొందరు ఐఏఎస్ అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు సూర్యనారాయణ.. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ.. వారిపై అవసరమైతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.. ఎస్ఆర్ లేకుండా పే ఫిక్సేషన్ చేయలేరు.. అలాగే ఉద్యోగులు కొత్త పీఆర్సీ వద్దని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చారని గుర్తుచేశారు.. సాంకేతికంగా చూస్తే డీడీవోలు.. ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోలేరని స్పష్టం చేశారు. ఎవరి మీదన్నా చర్యలు తీసుకుంటే పీఆర్సీ సాధన సమితి అండగా ఉంటుందని ప్రట్నించిన ఆయన.. పీఆర్సీ సాధన సమితి త్వరలోనే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.. కొత్త పేస్కేళ్ల ప్రకారం జీతాలు వస్తే.. పే స్లిప్పులను దహనం చేసి నిరసన తెలుపుతామని ప్రకటించారు సూర్యనారాయణ.
తాజావార్తలు
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!