నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్ర గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. నాయ్ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించి, ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ, జగన్లు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం…
తిరుమలలో నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలుతో కూడిన అజెండాను అధికారులు రూపొందించారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే రూ.3,171 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్ను పాలకమండలి ఆమోదించనుంది. హుండీ ద్వారా వెయ్యి కోట్లు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన నేఫథ్యంలో దర్శన టికెట్లు పెంచడంతో పాటు ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై టీటీడీ…
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన ఆమె.. మరి రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా అంటూ స్థానికల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ.. తన సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డికి…
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ…
రాష్ట్రానికి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎం చెప్పారని విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు అప్పగించారన్నారు. విద్యుత్ శాఖకు అవసరమైన అనేక పరికరాలు ఎక్కువ ధరకు ఈ షిరిడీ సాయయే సంస్థే సరఫరా చేస్తోందని, విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం కూడా కడప రెడ్డికి చెందిన షిరిడిసాయి…
2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద…
రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారని, మూడో దశలో…
సినిమా టికెట్ల ధరలు, షోలు, ఇతర సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఇటీవలే తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి సమావేశమై.. సీఎంతో చర్చించడం.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించడం జరిగిపోయాయి.. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత…
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో జరుగుతోన్న అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానని ప్రకటించారు.. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారు.. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లపై కలెక్టర్ దగ్గర విచారణకు రావాలని డిమాండ్ చేసిన ఆమె.. అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్ విసిరారు..…