NTR Politics in Ap: ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది.
నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఏర్పడే విజయవాడ జిల్లాకు NTR పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్టీఆర్ భారీ విగ్రహం పెట్టాలన్న తన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించుకున్నారు. పనులు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచన ఉందట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
టీడీపీ సమయంలో ఆ ఆలోచన రాలేదు
NTR విగ్రహం పెట్టాలన్న YCP నిర్ణయం కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కానీ.. అలాగే ఆయన స్వగ్రామంలో భారీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్న ఆలోచన కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి రాలేదు. కానీ ఆ పనిని వైసీపీ చేసి చూపిస్తోందనే చర్చ జరుగుతోంది. టీడీపీ విస్మరించిన ఎన్టీఆర్కు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందన్న అభిప్రాయం జనంలోకి వెళ్లడమే దాని లక్ష్యం. ఎన్టీఆర్ స్వగ్రామానికి నారా-నందమూరి కుటుంబ సభ్యులు వచ్చారు.. వెళ్లారు. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. కానీ తాత స్థాయికి తగ్గట్టుగా ఆయన స్వగ్రామంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం పెట్టాలన్న కనీస ఆలోచన చేయలేక పోయారనేది చర్చ. బాలయ్య కూడా వివిధ సందర్భాల్లో నిమ్మకూరును సందర్శించి.. తాను అక్కడ తిరిగాను.. ఇక్కడ ఆడుకున్నానని చెప్పుకున్నారే తప్ప.. ఎన్టీఆర్ కీర్తిని మరింత ఇనుమడింప చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే చర్చ స్థానికంగా జరుగుతోందట.
కీలక విషయాన్ని క్యాచ్ చేసిన వైసీపీ
NTR ఆయన సతీమణి బసవ తారకం చిన్న విగ్రహాలు నిమ్మకూరులోఉన్నాయి. అన్నిచోట్ల ఉన్నట్టే ఆ విగ్రహాలు ఉన్నాయి కానీ NTR స్వగ్రామం అన్న స్థాయిలో లేవు. దాన్నే YCP పట్టుకుంది. విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రాముడి స్థాయి.. ఆ లెవల్లో భారీ విగ్రహం రాబోతుంది అక్కడ. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు బలమైన.. కీలక సామాజికవర్గాలకు చెందిన వారిని ప్రసన్నం చేసుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!