Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
- రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్..
- మార్చి నెలాఖరు నుంచే నిధులు జమ..
- రూ.9 వేల కోట్లు అందజేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త .మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ.. మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
దీనిని రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా రూ. 4,500 కోట్లు.. మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. సన్న వడ్లు పండించే 90 శాతం రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ (IKP), డీసీఎంఎస్ (DCMS) కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్కు భారీ స్థాయిలో గ్యాస్..
గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..