Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
- రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్..
- మార్చి నెలాఖరు నుంచే నిధులు జమ..
- రూ.9 వేల కోట్లు అందజేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త .మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ.. మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
దీనిని రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా రూ. 4,500 కోట్లు.. మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. సన్న వడ్లు పండించే 90 శాతం రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ (IKP), డీసీఎంఎస్ (DCMS) కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్కు భారీ స్థాయిలో గ్యాస్..
గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!