Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..
- రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి వివేక్..
- మార్చి నెలాఖరు నుంచే నిధులు జమ..
- రూ.9 వేల కోట్లు అందజేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త .మార్చి నెల నుంచే రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ.. మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
దీనిని రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా రూ. 4,500 కోట్లు.. మిగిలిన నిధులను ఏప్రిల్ నెలలో జమ చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. సన్న వడ్లు పండించే 90 శాతం రైతులకు ప్రభుత్వం బోనస్ అందిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ (IKP), డీసీఎంఎస్ (DCMS) కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉందన్నారు.
Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్కు భారీ స్థాయిలో గ్యాస్..
గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల స్థానిక రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వెంకటస్వామి హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్గా పాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!