Ongole: రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు బంధువులు రాగా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే బాధితురాలిని చూపించాలని నిరసన చేపట్టారు. అయితే బాధితురాలి బంధువులతో కలిసి కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కాలికి గాయమైంది. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేను ఒంగోలు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలికి రక్తం కారుతున్నా ఎమ్మెల్యేను పోలీసులు పీఎస్కు తరలించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని కోరినా పోలీసులు స్పందించలేదని ఆరోపించాయి.
అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో రేపల్లె ఘటన బాధితురాలిని మంత్రి విడదల రజినీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపల్లె ఘటన అత్యంత బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబానికి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారని.. పూర్తి వివరాలు తీసుకుని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. బాధ్యులపై చర్యలతో పాటు బాధితురాలి ఆరోగ్యంపై కూడా సీఎం జగన్ మాట్లాడినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని.. ఇలాంటి ఘటనలను సీఎం జగన్ ఉపేక్షించరని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా అందించినట్లు ఆమె వెల్లడించారు.
Also Read
- YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
Repalle Case: రైల్వేస్టేషన్లో గ్యాంగ్ రేప్.. బాపట్ల జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!