Talari Venkat Rao: నాపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యతో గ్రామం అట్టుడికిపోగా.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును గ్రామస్తులు తరమడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే తలారిని తరిమికొట్టింది వైసీపీలోని మరో వర్గం అనే ప్రచారం సాగుతుండగా.. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. జి.కొత్తపల్లిలో తనపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు.
Read Also: Ganji Prasad Murder: ఎమ్మెల్యే తలారిపై సంచలన ఆరోపణలు..
Also Read
తనపై వైసీపీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య దారుణమైన విషయమన్న ఆయన.. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై మృతుడు కుటుంబ సభ్యులతో మాట్లాడతా అన్నారు. అయితే, జి.కొత్తపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మాత్రం వాస్తవమే అన్నారు. రెండు వర్గాలను కలిపి సన్మానించడం జరిగింది.. అయినా ఒక్కతాటిపైకి రాలేదున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారని తెలిపారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..