Anam Arunamma: టీడీపీ శవ రాజకీయాలు చేయడం సరికాదు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీలో జంగిల్ పాలన సాగుతోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని తొలుత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. వైసీపీ నేతలు తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.
ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల విషయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయాలు చేయడం సరికాదని చెప్పిన అరుణమ్మ.. దారుణాలు జరిగినప్పుడు మహిళలకు అండగా నిలవాలే తప్ప, వాళ్ళను మానసికంగా చంపేలా ప్రయత్నించకూడదని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన ఘటనపై పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారని, 9 నెలలలోపే వారికి శిక్ష పడేలా చేశారన్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని ఆనం అరుణమ్మ ఆరోపించారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ‘దిశ’ యాప్ను ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళల్ని వెంటనే పోలీసులు ఆదుకునేలా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 100 – 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు అద్దం పడతాయని ఆనం అరుణమ్మ చెప్పారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో