Anam Arunamma: టీడీపీ శవ రాజకీయాలు చేయడం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీలో జంగిల్ పాలన సాగుతోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని తొలుత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. వైసీపీ నేతలు తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.
ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల విషయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయాలు చేయడం సరికాదని చెప్పిన అరుణమ్మ.. దారుణాలు జరిగినప్పుడు మహిళలకు అండగా నిలవాలే తప్ప, వాళ్ళను మానసికంగా చంపేలా ప్రయత్నించకూడదని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన ఘటనపై పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారని, 9 నెలలలోపే వారికి శిక్ష పడేలా చేశారన్నారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని ఆనం అరుణమ్మ ఆరోపించారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ‘దిశ’ యాప్ను ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళల్ని వెంటనే పోలీసులు ఆదుకునేలా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 100 – 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు అద్దం పడతాయని ఆనం అరుణమ్మ చెప్పారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!