ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు..…
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని దుయ్యబట్టిన ఆయన.. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశాం అన్నారు.
పార్టీ అధినేత జగన్ హాజరుకాకపోయినా...నిరసన కార్యక్రమాలు జనంలోకి వెళ్లాయి. విద్యుత్ పోరుబాటలో జగన్ ఎక్కడో ఓ చోట నిరసనల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయట. ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయకుండా...నిరసన చేపట్టిన రోజే పులివెందుల నుంచి బెంగుళూరుకు వెళ్ళటం...ఆ పార్టీ కార్యకర్తలను కొంత నిరుత్సాహ పరిచిందట. ఆయన ధర్నాల్లో పాల్గొనకపోవటంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణల పేరుతో మొత్తం 12 నియోజకవర్గాలకుగానూ 11 చోట్ల సిట్టింగ్లను మార్చేసింది వైసీపీ. అది వికటించి గట్టి పట్టున్న జిల్లాలో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టు కావాల్సి వచ్చింది. ఇక ఫలితాల తర్వాత కొందరు నియోజకవర్గ ఇంచార్జ్లు అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇక ఇటీవల పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టిన అధినేత జగన్ మార్పులు చేయటం మొదలు పెట్టారు.
YS Jagan: ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణమన్నారు.
ఆర్కే రోజా... ఏపీ పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ సెంటర్... తెలిసినా, తెలియకున్నా సరే.. వాగ్ధాటితో అవతలోళ్ళ నోరు మూయించడంలో దిట్ట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా పనిచేసిన రోజా.... గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది.
వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల…
Dola Veeranjaneyulu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై జగన్ తన పార్టీ క్యాడర్తో కలిసి నిరసనలు తెలపడం ద్వారా సైకో వ్యూహాలకు పాల్పడుతున్నారని డోల ఆరోపించారు. “జగన్ ప్రభుత్వం APERC (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ…