Vasantha Krishna Prasad: వైసీపీపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. లీడర్ల కంటే XXXలే ఎక్కువ..!
- వైసీపీ లీడర్లపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..
- వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారని ఆరోపించారు.
Read Also: AP High Court: నిబంధనలు పాటించలేదు..! డీజీపీ ఎంపికపై హైకోర్టులో పిటిషన్..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
ఇక, వైసీపీలో రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆకస్మికంగా ఆ పార్టీని వదిలి వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సూచించారు వసంత కృష్ణప్రసాద్.. వైఎస్ రాజశేఖరరెడ్డికి రామచంద్రరావు ఆత్మ అయితే, జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆత్మగా అభివర్ణించిన ఆయన.. భవిష్యత్ లో చాలా మంది వైసీపీని వీడతారు, 3 నెలల్లో మిగిలిన లీడర్లు కూడా ఆ పార్టీ నుండి బయటకు వస్తారు అని జోస్యం చెప్పారు.. మునిగిపోయే పడవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే ఇక్కడ వద్దని వేరే జిల్లాలకు పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అబివృద్ది రెండు కళ్లుగా ముందుకెళ్ళాలంటే కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు.. ఇక, లోకేష్ డిప్యూటీ సీఎం అనేది సోషల్ మీడియా దుమారం, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుండి ఆదేశాలు ఉన్నాయని.. అటువంటి నిర్ణయం ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
తాజావార్తలు
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?