Off The Record: వైసీపీ నేతల్లో భయం పోయిందా..? ప్రతిపక్షంలో మార్పులేంటి..?
- గడిచిన ఏడు నెలలుగా వైసీపీలో స్తబ్దత..
- ముందుగా ఓటమి భారం నుంచి కోలుకున్న జగన్..
- ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు..
- తొలుత పార్టీ నేతల్లో కేసుల భయాలు?..
- ఇప్పుడిక వైసీపీ నేతల్లో కేసుల భయాలు పోతున్నాయా?..
- రెగ్యులర్గా కౌంటర్స్ ఇస్తున్న అంబటి రాంబాబు..
- ఈ మధ్యనే వాయిస్ పెంచుతున్న రోజా..
- కేసులున్నా అప్పుడప్పుడూ సౌండ్ చేస్తున్న పేర్ని నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి మౌత్ పీస్ల్లాగా మారి… నోటికొచ్చిందే మాట అన్నట్టుగా నాటి ప్రతిపక్షాల మీద చెలగేరిపోయిన సీనియర్స్ కూటమి సర్కార్ వచ్చాక కామ్ అయిపోయారు. కొందరు కంప్లీట్గా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోతే.. మరికొందరు అసలు గాయబ్ అయ్యారు. అసలే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ.. ఆపైన మాట్లాడే మొనగాళ్ళు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో.. గడిచిన ఏడు నెలల్లో వైసీపీకి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పార్టీ అధినేత జగన్ మాత్రమే ముందుగా ఓటమి భారం నుంచి బయటకు వచ్చి సమీక్షలతో మొదలు పెట్టి నిరసన కార్యక్రమాల వరకూ ప్లాన్ చేసి పార్టీని ట్రాక్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో కొందరు సీనియర్స్ అన్ మ్యూట్ బటన్ నొక్కడం ఇప్పుడు పార్టీకి కలిసి వచ్చే అంశం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
అదే సమయంలో తొలి ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో… ఎలాంటి కేసులు పెడుతుందోనని భయపడ్డ నేతలంతా… ఇప్పుడు ఇప్పుడిక కుదుటపడుతున్నారని, వాళ్ళలో భయం పోయినట్టు కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెగ్యులర్గా ఏదో ఒక రకంగా యాక్టివ్గానే కనిపిస్తున్నారు. పార్టీ తరపున కూటమి ప్రభుత్వానికి ఏ కౌంటర్ ఇవ్వటానికైనా రెడీ అయిపోతున్నారాయన. ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా కూడా వెకేషన్ మూడ్ నుంచి బయటకు వచ్చినట్టే కనిపిస్తోందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ మధ్య కాలంలోనే తన వాయిస్ వినిపించడంతో పాటు…అవసరమైన సందర్భాల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్తో టచ్లో ఉంటున్నారట. ఇక గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న ఆల్ నానీస్లో… ఒక నాని ఇప్పటికే పార్టీ వదిలి వెళ్ళిపోగా.. మరొకరు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ఇక పేర్ని నాని మాత్రం ఓవైపు ఆయనపై కేసుల హడావుడి నడుస్తున్నా.. అవసరం అనుకున్నప్పుడు తనకు సంభందించిన అంశాలతో పాటు పార్టీ లైన్ను కూడా ప్రస్తావిస్తున్నారు.
అటు గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు అవసరమైన సమయాల్లో తమ ఏరియా నుంచే వాయిస్ రెయిజ్ చేస్తున్నారు. వీరితో పాటు మేరుగు నాగార్జున, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ లాంటి మాజీమంత్రులు కూడా మెల్లిగా లైన్లోకి వచ్చేస్తున్నారట.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
ఇక మొదట్నుంచి యాక్టివ్గానే ఉంటున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంగతి సరేసరి. ఇలా…మెల్లిగా పార్టీ రీ ఛార్జ్ మోడ్లోకి వస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గడిచిన ఆరు నెలల్లో కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, కొన్నిచోట్ల క్యాడర్ గ్రామాలను విడిచి వెళ్తున్నా స్పందించని నియోజకవర్గ ఇంచార్జ్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అనూహ్యంగా తిరిగి తెరపైకి వస్తున్నారంటూ హ్యాపీగా ఉందట వైసీపీ అధిష్టానం. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయిందని, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ఆలస్యం చేస్తున్నారంటూ గట్టిగా ప్రచారం చేయడం ద్వారా.. ప్రజల్లో కూడా ఆ భావనను పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముఖ్య నేతలు మెల్లిగా మౌనం వీడుతుండటం బాగా ప్లస్ అని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇప్పటికే యాక్టివ్ అయిన నేతల సౌండ్కు ప్రజల్లో అసంతృప్తి తోడైతే ఇక రీ సౌండ్లో మోగిపోతుందని, పార్టీకి నలభై శాతం ఓట్లు వేసిన వాళ్ళని కాపాడుకోవడంతో పాటు…దూరమైన ఇతర వర్గాలను తిరిగి దగ్గర చేసుకునేందుకు దూకుడుగా వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ సౌండ్స్, రీ సౌండ్స్ పార్టీని ఎంతవరకు గాడిన పెడతాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!