వివిధ శాఖల పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాల యంలో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులతో పాటు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైయస్సార్ స్టీల్ప్లాంట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను సీఎం జగన్ సమీక్షించారు.
విద్యాకానుకపై సమీక్ష
2021–22 విద్యాకానుక కోసం రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విద్యా కానుక కింద పిల్లలకు నోట్ పుస్తకాలు, షూలు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్ను ప్రభుత్వం అందజేస్తుంది. జగనన్న గోరు ముద్దకోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మనబడి నాడు –నేడు మొదటి విడతకు ఇప్పటి వరకూ రూ.3650 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండో విడత కింద రూ. 12,663 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే దీనికోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు.విద్యారంగంలో నాడు నేడును సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇతర పథకాలపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉద్దానం, పులివెందుల, డోన్లలో కొనసా గుతున్న వాటర్ గ్రిడ్ పనులపైనా సీఎం సమీక్షించారు.ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న సీఎం అధికారులకు సూచించారు.వచ్చే ఏడాది మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని సీఎం జగన్కు తెలిపిన అధికారులు. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వీటీతో పాటు రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. దాదాపు రూ.30వేల కోట్లకుపైగా మౌలిక సదుపాయల కోసం ఖర్చుచేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, వాటి పనులపై అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. పోర్టులతో పాటు షిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా కొనసాగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!