ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్.... వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలోని ‘గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ చెప్పి రిపోర్టులను కాసేపు నవ్వించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా?.. పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, లేదా? అని జగన్ ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ జగన్…
నిజంగా సీఎం చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజంగా గౌరవం ఉంటే.. రామగిరి మండలం ఏడుకుర్రాకులలో 9వ తరగతి చదువుతున్న బాలికను 14 మంది టీడీపీ వాళ్లు సామూహిక అత్యాచారం చేస్తే, ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు లేదా? అని అడిగారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక కనిపించటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా…
సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే.. తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో ఏడాదిగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరు లేదని, ఆయనను ఇరికించేందుకు సడెన్గా ఓ కానిస్టేబుల్తో తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేశారన్నారు. తన పల్నాడు పర్యటన ముందు రోజు టాపిక్ చేయాలనే ఉద్దేశ్యంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ వయస్సులో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెంటపాళ్ల పర్యటనకు జనం ఎలా వచ్చారో చూశారు కదా?.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని, తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ బుధవారం…
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన కారణంగా.. ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల భార్గవ్ రెడ్డిపై…
ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: Today Astrology:…
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం అని, ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. చంద్రబాబు నాయుడు అంటే మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదని మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని అంజద్ బాషా పేర్కొన్నారు.…
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరన్నారు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారు అని జగ్గంపూడి…