CM Chandrababu: రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది.. ఎప్పుడైనా వైసీపీ కొనిందా?
- రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది
- మామిడిని ఎప్పుడైనా వైసీపీ కొనిందా?
- ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చింది
- ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలన్నారు. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రెండు సార్లు తమ ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది అని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై మీడియాతో మాట్లాడారు.
‘రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం మాది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చింది. ఏ పంట పండిస్తే లాభదాయకమో ఆలోచిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్పై చర్చిస్తున్నాం. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలి. ఆధునిక పద్దతులతో వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయి. పంటలకు ప్రాధాన్యత ఇస్తూ గిట్టుబాటు వచ్చేలా మేం చేస్తున్నాం. రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు కూడా వెళ్లాం. ఒక్కోసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్.. వారికి కూడా!
‘మామిడి ఎగుమతికి అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా మామిడి దిగుబడి వచ్చింది. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా?. రెండుసార్లు మన ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది. తమిళనాడు, కర్నాటక నుండి జిల్లాలోకి మామిడి రైతులను రాకుండా చూశాం. ఈమద్య కాలంలో దిగుబడి బాగా పెరిగింది. రైతులు అర్దం చేసుకోవాలి. జిల్లా రైతులకు ఎప్పుడైనా వైసీపీ నేతలు ఒక్కరూపాయి ఇచ్చారా?, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా?. మేం మైక్రో ఇరిగేషన్కు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
- Tags
- ap
- cm chandrababu
- Farmers
- Mango crop
- tdp
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?