Kinjarapu Atchannaidu: దండయాత్ర చేస్తానంటే ఊరుకోము.. వైఎస్ జగన్కు మంత్రి హెచ్చరిక!
- వైఎస్ జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
- దండయాత్ర చేస్తానంటే ఊరుకోము
- అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. వ్యవసాయాధారిత రాష్ట్రం ఏపీ. 65 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ రంగానికి పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాన్ని లైన్లో పెట్టీ స్ట్రీమ్ చేస్తున్నాము. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడి విపరీతంగా ఉంది, ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే సకాలంలో స్పందిస్తుంది మా ప్రభుత్వం. నాలుగు పంటలకు సమస్యలు వచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి, చిత్తూరు జిల్లాలో మామిడి, కోకో, నల్లబల్లి పంట సమస్యలు వచ్చాయి. మిర్చి రైతు నష్టపోయారు. కోకో పంట విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఏపీ చరిత్రలో కోకో పంటకు నష్టం వచ్చిందని ఎప్పుడు వినలేదు. ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చొరవ చూపిస్తున్నాము. కేజీ కి 5 రూపాయలు తక్కువ కాకుండా కోకో రైతులకు 14 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది’ అని తెలిపారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: IND vs ENG:: సుందర్ వికెట్ తీసినా.. జడేజా కారణంగానే స్టోక్స్ ఔట్! లంచ్కు ముందు ఏం జరిగిందంటే
‘ప్రకాశం జిల్లాలో నల్లబల్లి పంటకు సీఎం చొరవ తీసుకొని అవసరమైతే మనమే కొనాలని చెప్పారు. రూ,..350 కోట్లు కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా 12 వేలకు తగ్గకుండా పొగాకు రైతులను ఆదుకున్నాము. వైసీపీ నేతలు కూడా ఫోన్ చేసి నమ్మలేకపోయామని చెప్పారు. మామిడి, తోతపురి పంట ఈ ఏడాది 6.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. గత పంట కొన్న పరిశ్రమలు ఇప్పుడు కొత్త పంట కొనలేదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు స్పందించలేదు. 12 రూపాయలకు కొనాలని మేము ఆదేశించాము. కర్ణాటకలో మామిడి 16కి కొంటే.. ఏపీ కొనలేదు అని వైసీపీ నేతలు మీడియాలో ప్రచారం చేశారు. కర్ణాటకలో ఒక ఎకరాకు రెండు క్వింటాలు మాత్రమే కొనాలని కర్ణాటక ప్రభుత్వం షరతు విధించింది. కర్ణాటక ప్రభుత్వం 5 ఎకరాల వరకు మాత్రమే మామిడికి సీలింగ్ విధించింది. దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు, పార్టీ పేరు ఎత్తాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. 51 వేల మామిడి రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేస్తాం. మామిడి గుజ్జు తయారీ పరిశ్రమ దారులతో మాట్లాడి 12 రూపాయలకు కొనుగోలు చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పించారు. కర్ణాటకలో మామిడి రైతుల విషయంలో కేంద్ర మంత్రి ఇచ్చిన జీవోను తప్పుగా ప్రచారం చేశారు’ అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!