శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కాగా.. సోమవారం రాత్రి 9:58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో నేడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య…
తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లకు సెలవు. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో పార్ధివదేహం. మన్మోహన్ పార్థివదేహానికి నివళులర్పించిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. మన్మోహన్సింగ్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం. విద్యుత్ ఛార్జీల…
ఈరోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ కూతురి వివాహానికి హాజరుకానున్నారు. నేడు పులివెందులలోని వైసీపీ క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రేపు బెంగళూరులో ఓ వివాహానికి హాజరుకానున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏపీ విపత్తుల శాఖ పర్యటించనుంది. ముండ్లమూరు, తాళ్లూరు మండళ్లాల్లో వరుస భూప్రకంపనలపై అధ్యయనం చేయనున్నారు. నేడు వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో వంగవీటి రాధాకృష్ణ…
నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. నేడు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఎంపీ కేశినేని చిన్ని తుమ్మలపల్లి కలా క్షేత్రంలో విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. విజయవాడ దుర్గమ్మ భవానీ దీక్షల విరమణ నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. రేపటితో భవానీ దీక్షలు ముగియనున్నాయి. నేడు మాజీ మంత్రి పేర్ని…
నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం. ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్లు.. రాత్రి 8 గంటలకు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 9 గంటలకు పుణెరి-తమిళ్ తలైవాస్. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణ. నేడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం. మరి కొంతమంది అధికారులను విచారించనున్న ఏసీబీ. కేటీఆర్కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ. నేడు పెనమలూరు…
నేడు మెదక్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు మెదక్కు గవర్నర్. మెదక్ కెథెడ్రల్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న జిష్ణుదేవ్ వర్మ. అనంతరం కొల్చారంలోని గురుకుల విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి. విద్యార్థినులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని పరిశీలించనున్న గవర్నర్. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్న గవర్నర్. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,500 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10…
నేడు విజయ డైరీ పాలకవర్గ సమావేశం నంద్యాలలో జరగనుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పోలీస్ భద్రత కల్పించాలని చైర్మన్ ఎస్వీ జగన్, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిలు గురువారం నంద్యాల ఎస్పీని కోరారు. శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.…
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. కర్నూలులో వైసీపీ నేత తెరనేకల్ సురేంద్ర కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని నేడు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నేడు మంత్రి నారాయణ కాకినాడలో పర్యటించనున్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈరోజు విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ పర్యటించనున్నారు.…
నేడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని గుట్టపల్లి, సోమవరం, శెట్టిపల్లి గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు మంగళగిరిలో జరగనున్న ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకుని.. మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎస్సీ ఉపకులాల…
నేడు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ 2k రన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత హాజరుకానున్నారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. నేడు రాయచోటిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. నేడు గుంటూరులో కేంద్ర ,రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో…