What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
- నేటి నుంచి విజయవాడ బుక్ ఎక్జిబిషన్
- రాజమౌళి, మహేష్ చిత్రానికి పూజా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. సమావేశం తర్వాత మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లను విదించనున్నారు.
నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం ఆరంభం కానుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి 11రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరగుతుంది.
Also Read
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
ఇవాళ మధ్యాహ్నం 2.30కి సీఎం చంద్రబాబుతో పృధ్వీ రాజ్ జిందాల్ భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు జిందాల్ సంస్థ నడుపుతోంది. మరో రెండు ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటించనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటను కేంద్రమంత్రి పరిశీలించనున్నారు.
మహిళల ఉచిత బస్ ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు కర్ణాటకకు వెళ్లనుంది. రేపు బెంగుళూరులో కర్ణాటక రవాణా శాఖామంత్రి, అధికారులతో సమావేశం కానుంది.
ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరగనుంది.
నేడు ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు వరాహవతారంలో భక్తులకు స్వామి వారు దర్శనమివనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీస్లో పూజా కార్యక్రమం జరగనుండగా.. జనవరి చివరి వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత