What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
- నేటి నుంచి విజయవాడ బుక్ ఎక్జిబిషన్
- రాజమౌళి, మహేష్ చిత్రానికి పూజా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. సమావేశం తర్వాత మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లను విదించనున్నారు.
నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం ఆరంభం కానుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి 11రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరగుతుంది.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ఇవాళ మధ్యాహ్నం 2.30కి సీఎం చంద్రబాబుతో పృధ్వీ రాజ్ జిందాల్ భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు జిందాల్ సంస్థ నడుపుతోంది. మరో రెండు ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటించనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటను కేంద్రమంత్రి పరిశీలించనున్నారు.
మహిళల ఉచిత బస్ ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు కర్ణాటకకు వెళ్లనుంది. రేపు బెంగుళూరులో కర్ణాటక రవాణా శాఖామంత్రి, అధికారులతో సమావేశం కానుంది.
ఈరోజు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరగనుంది.
నేడు ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు వరాహవతారంలో భక్తులకు స్వామి వారు దర్శనమివనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీస్లో పూజా కార్యక్రమం జరగనుండగా.. జనవరి చివరి వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!