నేడు విజయవాడలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు. ఈరోజు నెల్లూరులో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈరోజు శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు స్వర్ణరథంలో విహరిస్తూ భక్తులకు శ్రీస్వామి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కర్నూలులోని కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నెక్లెస్ రోడ్లోని జలవిహార్ మూనట్ వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్థాన్ నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణా…
నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ. ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్న మోదీ. అనంతరం ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం. నేడు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్. హాజరుకానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలోనే మంత్రి నారా లోకేష్. నేడు కేంద్రమంత్రులు రాజ్నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని నారా లోకేష్ కలిసే అవకాశం.…
తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసిన టీటీడీ. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. నేడు గుంటూరు కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక … ఉత్కంఠ గా మారిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక… ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం…
అమరావతి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుండగా.. వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. విజయవాడలో…
ఇవాళ ఆన్లైన్లో రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేటి నుంచి ఏబీవీపీ 43వ రాష్ట్ర మహసభలు జరగనున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సభలకు 2500 మంది ప్రతినిధులు తరలిరానున్నారు. ఇవాళ తాడేపల్లిలోని…
ఇవాళ మూడోరోజు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్కు వెళ్లారు. సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన జవాన్ కార్తీక్ పార్దీవదేహం నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది. నేడు రాజమండ్రిలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ జరగనుంది. జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ వివాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు. రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత…
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ…
సింగరాయకొండ అయ్యప్ప నగర్లో గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరుకానున్నారు. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవం పున:ప్రారంభం కానుంది. ప్రస్తుతం రేపటికి సంబంధించిన దర్శనం టికెట్లు తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఒంగోలులో జిల్లా యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు…
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. ఈనెల 17న సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్. సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ను ఆప్గ్రేడ్ చేసిన రైల్వే శాఖ. ఇవాళ్లి నుంచి అందుబాటులో 4 అదనపు కోచ్లు. 20 కోచ్లతో రెగ్యులర్ ట్రైన్గా వందేభారత్ రాకపోకలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన రద్దీ. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల కొండ. ఉదయం 9 గంటల నుంచి…