Mamata Banerjee: “మహిళలకు బెంగాల్ సురక్షిత రాష్ట్రం”.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: మోడీ సభకు బలవంతంగా ప్రజల్ని తరలించారు.. కాశ్మీర్ నేతల ఆరోపణలు..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం మమతా బెనర్జీ మహిళలతో కోల్కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. మహిళా దినోత్సవానికి ముందు ఆమె ఈ భారీ ర్యాలీని చేపట్టారు. మహిళలకు అత్యంత సురక్షితమైనది బెంగాల్ రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. చాలా మంది వ్యక్తులు సందేశ్ఖాలీపై తప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారని, ఏదైనా నేరం జరిగితే చర్యలు తీసుకుంటామని, తృణమూల్ నేతల్ని కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టనని అన్నారు. బీజేపీకి ఈడీ, సీబీఐలతో నాయకులను అరెస్ట్ చేయించడం, ఎన్నికల్లో గెలుపొందడం ఒక్కటే తెలుసని ఆరోపించారు. బెంగాల్పై కోపం ఎందుకని, మీరు ఎన్నికల్లో గెలవకపోతే ప్రతిపక్షం పరువు తీయడం ఎందుకని అడిగారు.
సందేశ్ఖాలి భూ కబ్జాలు, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా షేక్ షాజహాన్ ఉన్నాడు. ఇతడిని టీఎంసీ 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసు బీజేపీ, టీఎంసీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. బెంగాల్ మహిళలకు సురక్షిత రాష్ట్రం అంటూనే.. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, ఈశాన్య రాష్ట్రంలో లైంగిక హింసపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!