West Bengal : బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితుల్లో టీఎంసీ నేత కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లో 18 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తర్వాత, అలీపూర్ కోర్టు శుక్రవారం నలుగురు నిందితులను మార్చి 18 వరకు పోలీసు కస్టడీకి పంపింది. కాగా మైనర్ను జువైనల్ హోంకు తరలించారు. కోల్కతాలో తనపై మైనర్ సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also:Pushpa Leela: కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్కి పట్టలేదు: పుష్ప లీల
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కౌన్సిలర్ కుమారుడని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తన డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై వేధింపులకు పాల్పడ్డారని బాలిక ఫిర్యాదులో మంగళవారం పేర్కొంది. ఐదుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నప్పటికీ ఒక రోజు తర్వాత బెయిల్పై విడుదల చేశారు.
Read Also:BitCoin : చరిత్రలో తొలి సారి 70వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “బాలిక సంఘటనకు సంబంధించిన వీడియోను చూపించింది. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ సెక్షన్ జోడించబడింది. దీని తర్వాత, ఐదుగురిని మళ్లీ పట్టుకుని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్లు 341, 323, 354, 509, 506, 328, 114, గ్యాంగ్ రేప్ సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో నలుగురితోపాటు ఒక మైనర్ పేరు కూడా ఉందని ఆయన చెప్పారు. నలుగురిని (పెద్దలు) మార్చి 18 వరకు పోలీసు కస్టడీకి పంపారు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, సీపీఐ(ఎం) కార్యకర్తలు సంబంధిత పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!