Sandeshkhali: “అర్థరాత్రి బలవంతం చేసేవాడు, కొట్టేవాడు”..వెలుగులోకి టీఎంసీ మాజీ నేత ఆగడాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్ఖాలీ ప్రాంతం ఇటీవల అల్లర్లతో అట్టుడికింది. మాజీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళా లోకం వీరికి వ్యతిరేకంగా ఎదురుతిరిగింది. వారిని అరెస్ట్ చేయాలని టీఎంసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కబ్జా, మహిళలపై వేధింపులు, రేషన్ కుంభకోణం, ఈడీ అధికారులపై దాడి ఇలా పలు కేసులో షేక్ షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. 55 రోజుల పాటు పరారీలో ఉన్న ఇతడిని కలకత్తా హైకోర్టు ఆదేశాలు, గవర్నర్ అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడి కేసును సీబీఐ విచారిస్తోంది.
ఇదిలా ఉంటే, మహిళలపై అతను ఎలాంటి అఘాయిత్యాలు సాగించేవాడో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ బాధిత మహిళ అతని అరాచకాలను వెల్లడించింది. సందేశ్ఖాలీ మహిళలు ఎదుర్కొన్న భయానక విషయాలను వెల్లడించింది. తృణమూల్ జిల్లా పరిషత్ సభ్యుడిగా షాజహాన్ కండబలం, ధనబలంలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాడని వెల్లడించింది. మహిళలను భౌతికంగా లాగేవాడని, అతని వ్యక్తులు కూడా మహిళ పట్ల అనుచితంగా తాకేవారని, అసభ్యకరంగా తిట్టేవారని బాధితురాలు వెల్లడించింది.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
Read Also: MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
‘‘షేక్ షాజహాన్ అర్ధరాత్రి మాకు ఫోన్ చేసేవాడు, మేము నిరాకరించినట్లైతే, మమ్మల్ని కొట్టేవాడు. మమ్మల్ని బలవంతంగా టీఎంసీ సమావేశాలకు హాజరుకావలి అని కోరేవాడు. వారి కోసం మేం రకరకాల ఆహారపదార్ధాలు చేసేవాళ్లం. వారు మద్యంతో భోజనం చేసేవారు’’ అని ఆమె చెప్పింది. ‘‘వారు మమ్మల్ని ముట్టుకుని, మా చేతులను లాగేవారు. వారి ప్రవర్తన చూసి భయపడి వెళ్లిపోయాను’’ అని ఆమె మచెప్పింది.
రేషన్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు వెళ్లిన సందర్భంలో షేక్ షాజహాన్ మనుషులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. జనవరి 5న ఈ ఘటన జరిగితే, 55 రోజుల పాటు అతను పరారీలో ఉన్నాడు. ఈ కేసుతో పాటు పలు కేసుల్ని సీబీఐ విచారిస్తో్ంది. షేక్ షాజహాన్ సోదరుడితో పాటు ముగ్గురు వ్యక్తులను శనివారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది. అతడిని టీఎంసీ పార్టీ 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!