Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Supreme Court Rejects West Bengal Govt Appeal Against Cbi Probe In Sandeshkhali Case

Sandeshkhali: సుప్రీంకోర్టులో మమత సర్కార్‌కు చుక్కెదురు

Published Date :March 11, 2024 , 6:00 pm
By Suresh Maddala
Sandeshkhali: సుప్రీంకోర్టులో మమత సర్కార్‌కు చుక్కెదురు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని గతంలో హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా సోమవారం నిరాకరించింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, అతని సహచరులు ఈడీ అధికారులపై దాడి చేశారని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read

  • AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
  • SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
  • Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?

సందేశ్‌ఖాలీ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై షాజహాన్ షేక్, అతని సహచరులు చేసిన దాడికి సంబంధించిందిగా అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సందేశ్‌ఖాలీ కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించగా.. పశ్చిమ బెంగాల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీర్పులో చేసిన ప్రతికూల వ్యాఖ్యలను బహిర్గతం చేయాలని ఆదేశించింది.

సందేశ్ ఖాలీ కేసులో బెంగాల్ పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణి అవలంభించారని కలకత్తా హైకోర్టు పేర్కొంది. నిందితులను రక్షించడానికే దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా మందలించింది. పోలీసుల తీరు బాధితులకు విశ్వాసాన్ని కలిగించలేకపోయిందని అభిప్రాయపడింది. కేసు తీవ్రతను ఎత్తిచూపుతూ.. నిందితుడు షాజహాన్‌తో సహా రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉన్నందున.. న్యాయమైన పూర్తి దర్యాప్తు అవసరమని హైకోర్టు నొక్కి చెప్పింది.

అంతేకాకుండా ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం కంటే మెరుగైన కేసు మరొకటి ఉండదని కూడా హైకోర్టు ప్రకటించింది. తాజాగా హైకోర్టు తీర్పును కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. ఇక సీబీఐ దర్యాప్తు వేగవంతమై అవకాశం ఉంటుంది.

నిరసనలు, ఆందోళనలతో సందేశ్‌ఖాలీ ప్రాంతం అట్టుడుకింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని అనుచరులు భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు ఆందోళనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా ఆందోళనలు చేశారు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించింది.

ఇకపోతే ఇటీవల ప్రధాని మోడీ బెంగాల్‌ టూర్‌లో సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారి బాధలను ఓపికగా విన్నారు. అనంతరం సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై మోడీ ధ్వజమెత్తారు. నిందితులకు మమత కుమ్ముకాశారని ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మహిళల దినోత్సవం సందర్భంగా సీఎం మమత కూడా పెద్ద ఎత్తున మహిళలతో కలిసి భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. బెంగాల్ మహిళలకు సేఫ్ జోన్ అని సందేశం ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI probe
  • Govt Appeal
  • Sandeshkhali case
  • Supreme Court Rejects
  • West Bengal

తాజావార్తలు

  • Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!

  • Vinesh Phogat: బ్రిజ్ భూషణ్‌ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!

  • AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..

  • OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions