భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. హన్మకొండ జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న విజయశాంతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు.. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న ఆమె.. సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారని తెలిపారు. Read…
భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కోరారు. సాంస్కృతిక మహోత్సవాలపై తాజాగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో “భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండడం మనందరికీ గర్వకారణం. Read Also : Bheemla Nayak :…
మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…
వాళ్లంతా పోలీస్ ఇన్స్పెక్టర్లు. యూనిఫామ్ డ్యూటీలో ఉన్న అధికారులు. సొంతంగా విదేశాలకు వెళ్లితే ఎలాంటి గొడవా ఉండేది కాదు. కానీ.. లిక్కర్ డాన్తో మిలాఖతై ఫారిన్ ట్రిప్పులకు వెళ్లి.. థాయ్ మసాజ్లు.. క్యాసినో ఆటల్లో మునిగి తేలారట. విషయం తెలిసి పోలీస్ బాస్లు కన్నెర్ర చేయడంతో డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. వాళ్లెవరో లెట్స్ వాచ్..! జల్సాల కోసం విదేశాలకు ఇన్స్పెక్టర్లు..?బ్యాంకాక్లో విహార యాత్రలు.. థాయ్ మసాజ్లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో…
ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి…
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.. ఈ మేరకు రేపు (మంగళవారం) కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వర్షా కాలం ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని కేబినెట్కు వివరించారు అధికారులు..…
మేడారం జాతర ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతున్నది. ఫిబ్రవరి 16 నుంచి జాతర ప్రారంభం కాబోతున్నది. అయితే, జాతర కంటే ముందే భక్తులు మేడారంకు పోటెత్తుతున్నారు. జాతరలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ఆంక్షలు, జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ఉద్దేశంతో ముందుగానే భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద…
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్…
హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా…