ఖాకీలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు గురైన వారిలో అధికారులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. తాజాగా కేయూ పోలీస్ స్టేషన్ సీఐ జనార్ధన్రెడ్డికి, జఫర్గడ్ ఎస్సై మాధవ్ కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కమలాపూర్ పీఎస్లో నలుగురు కానిస్టేబుళ్లు, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లు, కేసముద్రం పోలీస్ స్టేషన్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఏటూరు నాగారం స్టేషన్లో ఇద్దరు, తొర్రూరు స్టేషన్లో ఇద్దరు, దుగ్గొండి స్టేషన్లో ఒకరు, పర్వతగిరి పోలీసుస్టేషన్లో ఒక్కరు కరోనాతో బాధపడుతున్నారు. నర్సంపేట పోలీస్ స్టేషన్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక ఏఎస్సై, డ్రైవర్ హోమ్ గార్డ్, మరో కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా ఐనవోలు జాతర బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కరోనా టెస్టులు చేస్తే ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని వెంటనే ఐసోలేషన్ కి పంపించారు అధికారులు.
Read Also: యూపీలో రాజీనామాలు పెద్ద విషయం కాదు.. కొట్టిపారేసిన కేంద్ర మంత్రి
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడం ఉన్నతాధికారులను ఆందోళనలు గురి చేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేశారు. జాతర బందోబస్తుకు వస్తున్న వారికి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు మస్కులు అందించడం, శానిటైజరర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయి అంటే చాలు పోలీసు క్యాంపు దగ్గరే టెస్ట్ చేసి మిగిలిన వాళ్లకు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా రెండో వేవ్ లో కరోనా బారిన పడి చనిపోయిన వారిని జ్ఞాపకాలు మరువక ముందే మరో సారి కరోనా బారిన పడుతున్న పోలీసు సిబ్బంది వణికిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం కరోనా పీడిస్తుండటంతో సిబ్బందిలో గుబులు నెలకొంది. జాగ్రత్తలు పాటిస్తున్నా.. కరోనా బారిన పడాల్సి వస్తోందని సిబ్బంది అధికారుల దగ్గర వాపోతున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!