ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పింది చేస్తాడు అని అందరికీ తెలుసు.. అయితే ట్విట్టర్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు.. ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నాడు. అయితే నిన్నటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు.
కోహ్లీ.. రాహుల్ చాహర్ బౌలింగ్ లో రెండు పరుగులు తీయడం ద్వారా వ్యక్తిగత స్కోర్ 30 వద్ద ఓ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో 100వ సారీ విరాట్ కోహ్లీ 30 ఫ్లస్ మార్క్ ను దాటాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో 30 ఫ్లస్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొహాలీ వేదికగా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్-16లో గురువారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ మొహాలీలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయపథంలోకి రావాలని కోరుకుంటోంది.
Virat kohli : ఐపిఎల్లో సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించబడింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు ముందు ఇదే ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేశ్ బాబును అభిమానించే వీరు.. చిన్నస్వామి స్టేడియం ముందు విరాట్-మహేశ్ బాబు పోస్టర్లతోహల్ చల్ చేశారు.