రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్లో కోహ్లీ సేదతీరాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. విరాట్ తన ట్విటర్లో బీచ్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20…
సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికీ ఒక ఫేవరేట్ క్రికెటర్ ఉంటారు. అందరూ దాదాపు బాగా పేరుగడించిన దిగ్గజాల పేర్లే చెప్తారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అందుకు భిన్నంగా ఆశ్చర్యపరిచాడు. తనకు సచిన్, కోహ్లీ లాంటి డ్యాషింగ్ ప్లేయర్లు ఇష్టమేనని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్.. ఫేవరేట్ ప్లేయర్ మాత్రం వసీమ్ జాఫర్ అని చెప్పుకొచ్చాడు. ‘‘అందరికీ తమకంటూ ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నాకూ ఉన్నారు. జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే నాకెంతో…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్లో 200 మిలియన్ మార్క్ని దాటేశాడు. ఈ ఘనత…
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్లో ఈ ఇద్దరు చెలరేగాలని, లేకుంటే వారికి ఇదే చివరి మెగా టోర్నీ అవుతుందని హెచ్చరించారు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ టెండూల్కర్ సైతం 100వ…
IPL 2022 సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని T20 ప్రపంచకప్ లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్కు తాగాజా జరిగిన IPLప్రదర్శన ఆధారంగా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసాడు. అయితే ఈ జట్టులో రోహిత్ ,కోహ్లీ కి అవకాశం దక్కలేదు. అయితే తన జట్టు ఓపెనర్లుగా KL రాహుల్, ఇషాన్…
“ఈ సాల కప్ నమ్ దే ” అనే నినాదం ప్రతీ సీజన్ వినీ వినీ విసుగొస్తుంది గాని కప్ మాత్రం కొట్టడం లేదు. దీంతో ఈ నినాదం వచ్చే సీజన్ కి పోస్టుపోన్ అవుతుంది. గత 15 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. కనీసం తాజాగా ముగిసిన సీజన్లోనైనా ఆర్సీబీ టైటిల్ కొడుతుందని భావించినా.. ఆ జట్టు ప్రయాణం రెండు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. అద్భుత ప్రదర్శనతో ప్లే…
కొంతకాలం నుంచి ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. పోనీ ఐపీఎల్లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే.. ఆ టోర్నీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు అర్థసెంచరీలు మినహాయిస్తే, అతడు ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. ముఖ్యంగా.. అత్యంత కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్లో కోహ్లీ ఏమాత్రం సత్తా చాటకుండా త్వరగా ఔటవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో, అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్ళు సైతం కోహ్లీని విమర్శించారు. నెటిజన్లైతే…
సెంచరీలకు అతను పెట్టింది పేరు. రికార్డులకు అతను రారాజు. చేసింగ్ లో అతను బ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ పక్కా అనుకొనే ఫామ్ అతనిది అతనే రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుత ఫామ్ ని చూసి విరాట్ కోహ్లీని విమర్శించడం ఆపాలని పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ మాజీ క్రికెటర్లకు సూచించాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటరని, అతనికి కనీస గౌరవం…
ఆర్సీబీ కల ఈసారి కూడా నెరవేరలేదు. మరో ఐపీఎల్ అలా వచ్చి ఇలా వెళ్లింది. అయినా ‘ఈ సాలా కప్ నమదే’ అన్న నినాదం ఆర్సీబీ అభిమానుల మది నుంచి వెళ్లిపోవడం లేదు. దీంతో మరో ఏడాది కోసం వాళ్లంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఆర్సీబీ ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ ఆర్సీబీ జట్టును దారుణంగా దెబ్బతీసింది. ప్లే ఆఫ్స్లో కోహ్లీ కనుక…