Virat Kohli: ఫామ్లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ 83 మ్యాచ్ల్లో 3564 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేయకపోయినా కోహ్లీ టాప్ ప్లేస్లో ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ జాబితాలో రోహిత్ శర్మ 70 మ్యాచ్ల్లో 3,318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 75 మ్యాచ్ల్లో 2,593 పరుగులు చేసి మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ 57 మ్యాచ్ల్లో 2,524 నాలుగో స్థానంలో ఉన్నారు.
Read Also: IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్స్వీప్పై టీమిండియా గురి..!!
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
2019లో 44 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. అయితే వీటిలో అత్యధిక పరుగులు ప్రపంచకప్ ముందు చేసినవే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాతే కోహ్లీ ప్రదర్శన మసకబారింది. అటు 2020లో 22 ఇన్నింగ్స్ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మూడేళ్లుగా కోహ్లీ ప్రదర్శన కారణంగా అతడి మొత్తం సగటు కూడా తగ్గుతూ వస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లోనూ నెమ్మదిగా కోహ్లీ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అయితే విరాట్ ఒక్క భారీ ఇన్నింగ్స్తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!