Virat Kohli: ఫామ్లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ 83 మ్యాచ్ల్లో 3564 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేయకపోయినా కోహ్లీ టాప్ ప్లేస్లో ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ జాబితాలో రోహిత్ శర్మ 70 మ్యాచ్ల్లో 3,318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 75 మ్యాచ్ల్లో 2,593 పరుగులు చేసి మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ 57 మ్యాచ్ల్లో 2,524 నాలుగో స్థానంలో ఉన్నారు.
Read Also: IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్స్వీప్పై టీమిండియా గురి..!!
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
2019లో 44 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. అయితే వీటిలో అత్యధిక పరుగులు ప్రపంచకప్ ముందు చేసినవే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాతే కోహ్లీ ప్రదర్శన మసకబారింది. అటు 2020లో 22 ఇన్నింగ్స్ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మూడేళ్లుగా కోహ్లీ ప్రదర్శన కారణంగా అతడి మొత్తం సగటు కూడా తగ్గుతూ వస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లోనూ నెమ్మదిగా కోహ్లీ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అయితే విరాట్ ఒక్క భారీ ఇన్నింగ్స్తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!