Virat Kohli: ఫామ్లో లేకపోయినా అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ 83 మ్యాచ్ల్లో 3564 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్క సెంచరీ చేయకపోయినా కోహ్లీ టాప్ ప్లేస్లో ఉండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ జాబితాలో రోహిత్ శర్మ 70 మ్యాచ్ల్లో 3,318 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 75 మ్యాచ్ల్లో 2,593 పరుగులు చేసి మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ 57 మ్యాచ్ల్లో 2,524 నాలుగో స్థానంలో ఉన్నారు.
Read Also: IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్స్వీప్పై టీమిండియా గురి..!!
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
2019లో 44 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. అయితే వీటిలో అత్యధిక పరుగులు ప్రపంచకప్ ముందు చేసినవే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాతే కోహ్లీ ప్రదర్శన మసకబారింది. అటు 2020లో 22 ఇన్నింగ్స్ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మూడేళ్లుగా కోహ్లీ ప్రదర్శన కారణంగా అతడి మొత్తం సగటు కూడా తగ్గుతూ వస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లోనూ నెమ్మదిగా కోహ్లీ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అయితే విరాట్ ఒక్క భారీ ఇన్నింగ్స్తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!