India Vs England: నేడు మూడో వన్డే.. గెలిచిన జట్టుకే సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డి తీరాల్సిందే. ముఖ్యంగా మూడో పేసర్గా తొలి రెండు వన్డేల్లో ప్రసిద్ధ్ కృష్ణ విఫలమయ్యాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్కు జట్టులో స్థానం లభించే అవకాశాలున్నాయి.
Read Also: Yasir Shah: రీఎంట్రీతో చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్
Also Read
- Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
- Rahul Dravid: "హీరోలు లేకుండా క్రీడ ఉండదు".. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
- Shubman Gill: "మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు".. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
అటు ఈ వన్డేలో అయినా విరాట్ కోహ్లీ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలం అవుతోంది. మరోవైపు సూపర్ ఫామ్లో కనిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశగా టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మరోసారి రాణిస్తే భారీ స్కోరు ఖాయమవుతుంది. బౌలింగ్లో బుమ్రా, షమీ, హార్డిక్ పాండ్యా, చాహల్ నిలకడగా వికెట్లు తీయాలి.
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..