ఐపీఎల్ 2022: ఇటీవల సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో స్వల్ప స్కోరుకే అవుటైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. రాజస్థాన్తో మంగళవారం రాత్రి జరిగిన పోరులో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు నానా తంటాలు పడింది. చివరకు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. దీంతో 29 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8…
ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్గా వెనుతిరిగాడు. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ ఇదే పునరావృతం అయ్యింది. కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే…
ఐపీఎల్ 2022 సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రదర్శన బాగానే ఉన్నా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరే అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు కుమ్మరించి కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే అతడు మాత్రం పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయంగానూ కోహ్లీ విఫలమవుతున్నా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తాడని బెంగళూరు ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా…
ఐపీఎల్లో మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ కింగ్స్ చేధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని మోతెక్కించారు. దీంతో అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/2 స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లీ (41), దినేష్ కార్తీక్ (32), అనుజ్ రావత్ (21)…
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్…
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించిన జడేజా ఆల్రౌండర్ల కేటగిరీలో 385 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ (భారత్) మూడో స్థానంలో, షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 916…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్కు ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తాడని వెల్లడించాడు. తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ సీజన్కు విరాట్ కోహ్లీ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నాడని అశ్విన్ అన్నాడు. దీంతో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆర్సీబీ కొత్త కెప్టెన్గా డుప్లెసిస్ను ఎంపిక చేయడం మంచి పరిణామమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్పై అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ అతి జాగ్రత్తగా ఆడుతుండటం అతడి కొంప ముంచుతోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మునుపటిలా ఆడాలంటే దూకుడుగా ఆడాలని సూచించాడు. కెరీర్లో ప్రారంభంలో స్వేచ్ఛగా ఆడినట్లే ఇప్పుడు కూడా ఆడితేనే తిరిగి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని తెలిపాడు. దీని కోసం కోహ్లీ మళ్లీ తన అకాడమీకి రావాలని.. అతడు తన బేసిక్స్ను తిరిగి నేర్చుకోవాలని కోరాడు.…
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్గా పేరుపొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నాడు.. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్ కోహ్లి అవుటైన తీరు ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అవుటయ్యాడో.. సెకండ్ ఇన్నింగ్స్లోనూ సేమ్ టు సేమ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో అవుటైతే.. రెండో ఇన్నింగ్స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్కు తన వికెట్ను సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. వందో టెస్టులో 45 పరుగులు చేసిన విరాట్.. ఇక…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు కనీసం హాఫ్ సెంచరీలైనా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచరీ సంగతి పక్కన బెడితే… కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టెస్టు కెరీర్లో కోహ్లీ సగటు ఏకంగా 50కి దిగువకు పడిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న కోహ్లీ ప్రస్తుతం ఆ…