ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్ మరమ్మత్తులు చెయ్యాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అనపర్తి – బలభద్రపురం మధ్య పలుచోట్ల సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ప్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండటంతో రోడ్డుపై వున్న ప్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. స్వాధీనం చేసుకున్న ప్లెక్సీలను వాహనంలో…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సంతోష్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా కేసీఆర్ తనను చిన్నప్పుడు భుజాలపై ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది …” అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో నెట్టింట ఈ పిక్ వైరల్గా మారింది. అంతేకాకుండా టీఆర్ఎస్ అభిమానులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు…
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది. మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే…
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిఒక్కరికి ఒక కల ఉంటుంది.. ఆ కలను నిజం చేసుకోవడానికే అందరు తాపత్రయపడతారు. అందరి కలలు నిజం అవ్వాలని లేదు.. ఇంకొన్ని కలలు నిజం కావాలంటే కొద్దిగా కష్టపడితే చాలు.. అయితే ప్రపంచములో కనివిని ఎరుగని వింతలు.. విచిత్రాలు ఉన్నట్టే .. చాలామందికి వింత కలలు కూడా ఉంటాయి.. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కల కూడా అలాంటిదే.. ఆ కళను ఆమె నిజం చేసుకొని ప్రపంచ రికార్డ్ ని సాధించింది.…
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ…
ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసం చేసి వారి వద్ద నుంచి 200 కోట్లు మనీలాండరింగ్కు పాల్పడిన సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయంతో తెలిసింది. అయితే బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సుఖేశ్ చంద్రశేఖర్ కోట్లు విలువైన చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడీ చార్జ్షీట్లో పొందుపరిచింది. జాక్వెలిన్కు రూ.52 లక్షలు విలువ చేసే గుర్రంతో పాటు రూ. 9లక్షలు విలువ చేసే పిల్లినే కాకుండా మొత్తంగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు సుఖేశ్…
పిల్లుల దత్తతను ప్రోత్సహించే లక్ష్యంతో, మార్స్ పెట్కేర్, వెట్స్ సొసైటీ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (వీఎస్ఏడబ్ల్యూఆర్డీ)తో కలిసి ఆదివారం నగరంలో క్యాట్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80కి పైగా పిల్లుల పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్ హాజరయ్యారు. అయితే వేదిక వద్ద ఉచిత ఆరోగ్య శిబిరం మరియు ఇండీ క్యాట్ దత్తత డ్రైవ్ కూడా నిర్వహించారు. ఫెలైన్ క్లబ్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడిన ఈ…
జమ్మూకాశ్మీర్ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం…