మన్యం రొయ్యలతో భలే ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జీవనాధారం. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరి పుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమే కాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మన్యం రొయ్యగా వీటికి పేరుంది. విశాఖ ఏజెన్సీలో పూర్వకాలం నుండి ఈ పురుగులు తినడం గిరిపుత్రుల ఆహార శైలిలో ఓ భాగం. ప్రస్తుతం ఆ పురుగులను సేకరించి అమ్ముతూ కొంతమంది గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారు.ఏజెన్సీలో బొడ్డెంగు పురుగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పూర్వకాలం నుంచి వీటిని తింటున్నారు గిరిజనులు.

ఏజెన్సీ ఎత్తైన కొండలపై ఉన్న ఈత చెట్టుల దుబ్బుల కింద పెరిగే ఈ పురుగులను.. మన్యం రొయ్యగా అభివర్ణిస్తారు. వీటిని స్థానికులు బొడ్డెంగులుగా పిలుస్తారు. సాధారణంగా ఇవి ఈత కాండం తింటూ పెరగడంతో కొవ్వు కలిగి ఉంటుంది. ఈ పురుగులను స్థానికులు వేయించుకుని తినడంతో పాటు కూరగా కూడా వండుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి ఈ పురుగులు లభించడంతో పండుగ చేసుకుంటారు గిరిపుత్రులు. ప్రస్తుతం వీటి రుచి మైదాన ప్రాంత వాసులను ఆకట్టుకోవడంతో పురుగులు సేకరించి అమ్ముకుంటున్నారు. ఒక్కో ఈత దుబ్బు నుండి రెండు లేక మూడు పురుగులు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో రాత్రంతా పురుగుల వేట సాగించి.. ఉదయాన్నే అమ్మకానికి బయలుదేరుతారు. నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయంటే ఏజెన్సీలో వీటికి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది.ఆహారంతో పాటు ఆదాయవనరుగా పురుగులు మారడం విచిత్రమే మరి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
తాజావార్తలు
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!