PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Independence Day 2026 Speech: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ పురోగతికి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది. జెండా ఆవిష్కరణ అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఒకవైపు దేశాభివృద్ధిని వివరిస్తూనే, మరోవైపు ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల విలవిలలాడిన ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ తన గాఢమైన సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం మాత్రమే కాదు, 140 కోట్ల మంది పౌరులతో కూడిన దేశమంతా బాధితులకు అండగా నిలుస్తుందని, వారికి అన్ని రకాలుగా పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం జాతీయ గీతాల గొప్పతనాన్ని స్మరిస్తూ, ఈ ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారిగా ‘వందేమాతరం’ నినాదాలు ప్రతిధ్వనించడం అత్యంత చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. వందేమాతరం గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో ఈ ఘటన జరగడం మరింత ప్రత్యేకతను సంతరించుకుందని మోడీ హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఊహించని వేగంతో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని గుర్తుచేశారు. దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, వృద్ధులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల పౌరులందరి కృషి, పట్టుదలే ఈ పురోగతికి ప్రధాన కారణమని వారి సేవలను కొనియాడారు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాల గణాంకాలను వివరిస్తూ.. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 7 రెట్లు పెరిగాయని వెల్లడించారు. వీటితో పాటు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు పెరగ్గా, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ఏకంగా 33% పెరిగిందని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు 100% వృద్ధిని నమోదు చేయడం భారత్ సాధించిన సాంకేతిక విప్లవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పూర్తిస్థాయి ‘అభివృద్ధి చెందిన దేశం’గా (డిజిటల్ అండ్ డెవలప్డ్ నేషన్) మారినప్పుడు, జగత్తు మన దేశాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
- Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
- Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
దేశానికి అత్యంత కీలకమైన ఇంధన భద్రత (Energy Security) పై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకప్పుడు దేశీయంగా ఏమీ చేయలేక ‘నో-గో ఏరియా’లుగా ఉన్న రంగాలను ఇప్పుడు ‘గో-అహెడ్ ఏరియా’లుగా మార్చేశామని చెప్పారు. ఇంధన అవసరాల కోసం భారత్ సాధిస్తున్న పురోగతిలో భాగంగా ఈ ఏడాది ‘ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీ’లో అగ్రస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కైవసం చేసుకోవడం పరమావధి అని, ఇది అణు ఇంధన రంగంలో స్వయంసమృద్ధికి పెద్ద పీట వేస్తుందని వ్యాఖ్యానించారు. కొరత వనరులలో లేదని, మన ఆలోచనా పరిమితుల్లోనే ఉండిపోతుందని.. ఆలోచనలు పరిమితమైనప్పుడు మన సొంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేమని హెచ్చరించారు. అందుకే భవిష్యత్తు అవసరాల కోసం 200 గిగావాట్ల (GW) అణుశక్తిని లక్ష్యంగా పెట్టుకుని, కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
మరోవైపు ఇంధన అన్వేషణలో భాగంగా ఒకప్పుడు భారతదేశంలో 98% తీరప్రాంత (Offshore) ఇంధన నిల్వల అన్వేషణపై ఉన్న ఆంక్షలను సవరించి, చమురు, సహజ వాయువు అన్వేషణల కోసం ఈ ప్రాంతాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చినట్లు మోడీ వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ.. ఇప్పటివరకు దేశంలో 1.75 కోట్ల ఇళ్లకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు అందించామని, అలాగే 50 లక్షలకు పైగా గృహాలు సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నాయని తెలియజేశారు. పరాయి దేశాలపై ఆధారపడటం మాని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వయంసమృద్ధిని మరింత బలోపేతం చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర భారత్’ సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, ప్రస్తుతం ప్రతి భారతీయుడు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాలతో మమేకమై దేశ పురోగతిలో భాగస్వామి అవుతున్నారని స్పష్టం చేశారు. మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు.. ఇతర దేశాలపై ఆధారపడితే మన సామర్థ్యం పెరగదు.. మన ప్రయోజనాలను మనమే కాపాడుకోవాలి.. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!