Aghori Facts : మహిళా ఆఘోరాలు చేసే పనులు చూస్తే.. వెన్నులో వణుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఘోరాలు అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నార్త్ ఇండియాలో ట్రావెల్ చేసినవారు, కాశీ, ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిన మాత్రం ఇటువంటి వారు కనిపించరు. సినిమాలో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపే వారు కూడా ఉంటారా? అంటే మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. కాశీ, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు. అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. దిగంబరులు స్మశానంలో బూడిద పూసుకుని ఉంటారు. జట్టు జడలు కట్టి శరీరం మట్టితో కొట్టుకుపోయి ఒంటినిండా గాయాలతో ఉంటారు.

Also Read
అఘోరాలు కొందరు.. వారి శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎటు పడితే అటు శరీరాన్ని వంచుతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోటా ధరిస్తారు. పూర్తి కాలం వారు నగ్నంగానే ఉంటారు. ఇప్పటివరకు సినిమాల్లో కూడా పురుష అఘోరాల గురించి మాత్రమే మనం చూసాం. కానీ ఉత్తర భారతదేశంలో మహిళ అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా స్మశానంలో నిద్రించి, దాంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు. మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగా సాధువులుగా మారాలి అంట. అంటే కనీసం ఆరేళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. అంటే ఆరేళ్ల పాటు కటిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి.

అలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న వారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహా మండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు. ఇక ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రధానం చేసుకోవాలి. తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి సన్యాసినిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లుగా భావించాలి. నాగ సాద్విగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలు పాల్గొనాల్సిన ఉంటుంది. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి. ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు. తర్వాత మళ్లీ ఈశ్వర నామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు.

సాయంత్రం సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు. మహిళా నాగ సాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయ దేవిని ఎక్కువగా పూజిస్తారు. పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. ఎందుకంటే వారు సర్వ సంఘ పరిత్యాగిలు కదా.. కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించాలని దైవాన్ని అఘోరాలు వేడుకుంటారు. మహిళ అఘోరాలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. సాద్విగా మారే సమయంలోనే పిండ ప్రధానం పెట్టుకోవడంతో పాటు దిన కర్మలు చేస్తారు కనుక ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో లేదా ఏదైనా చెరువులో పడేస్తారు.
ఇక విషయం ఎంత వరకు నిజమో ఎవరు ప్రూఫ్తో బయట పెట్టింది లేదు. కానీ కొందరు అఘోరాలు చనిపోయిన శవాలను తింటారంట. స్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే స్మశానం బయట నదిలో పడవేస్తారు. పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళ అఘోరాలు కాషాయ వస్త్రం ధరిస్తారు. స్నానం ఆచరిస్తున్న సమయంలో కూడా మహిళా అఘోరాలు వస్త్రాన్ని అలాగే ఉంచుకోవాల్సిందే. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగ సాధువులుగా మారేందుకు కాశీ, వారణాసి వస్తుంటారు.
తాజావార్తలు
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడా..?
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం.. హైదరాబాద్కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
-
Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!