పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా? అంటే... అవును... జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 -24 మధ్య వైసీపీ తరపున పవర్లో ఉన్న బొల్లా.... ప్రత్యర్థుల్ని గట్టింగానే వేధించారని, ఇక నోటి దురద గురించి అయితే చెప్పేపనేలేదన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు, మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పల్నాడు జిల్లా వినుకొండలో రెండ్రోజుల క్రితం ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని రషీద్ నివాసానికి వెళ్లిన జగన్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది.