Ayatollah Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ భారత్ మిత్రుడేనా.? ఈ కీలక విషయాలే సాక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayatollah Khamenei: మిడిల్ ఈస్ట్ రగులుతోంది. ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్పై భీకర దాడులు చేశాయి. ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమర్చారు. ఖమేనీతో పాటు టాప్ రాజకీయ, సైనిక నేతల్ని చంపేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ కూడా ప్రతీకార దాడుల తీవ్రత పెంచింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, బహ్రైయిన్ ఇలా మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఖమేనీ మరణం పాకిస్తాన్లో చిచ్చుపెట్టింది. ఖమేని మరణం తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్లో నిరసనకారులు తీవ్ర నిరసన తెలిపారు. భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో షియా ముస్లింలు నిరసనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లక్నో, హైదరాబాద్, బెంగళూర్ వంటి ప్రాంతాల్లో ఖమేనీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
ఇదిలా ఉంటే, ఖమేనీ మృతిపై అనేక ఇస్లామిక్ మౌనంగా ఉన్నాయి. భారత్ కూడా ఖమేనీ మృతిపై సంతాపం వ్యక్తం చేయలేదు. ఘర్షణలు తగ్గేలా ఇరు పక్షాలు చర్చల్ని ఆశ్రయించాలని మాత్రమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ నిజంగా భారత్ పక్షాన నిలిచారా? లేదా? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ వైఖరిని ప్రతిబింబిచేలా ఇరాన్ సుప్రీంలీడర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
2017-2024 మధ్య కాలంలో ఖమేనీ చాలా కాలం భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. వీటి కారణంగా ఖమేనీని ‘నిజమైన భారత మిత్రుడు’’ అని పిలువలేమని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.
* కాశ్మీర్ అంశం: 2017, 2019లలో కాశ్మీర్ అంశాన్ని ఖమేనీ ప్రస్తావించారు. కాశ్మీర్లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, వారికి మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ వలే ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
* ఆర్టికల్ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఖమేనీ దీనిపై మాట్లాడుతూ.. ‘‘న్యాయమైన విధానం ’’ అవలంభించాలని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ ఇరాన్ రాయబారిని పిలిపించి అభ్యంతరం తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఖండించింది.
*CAA , ఢిల్లీ అల్లర్లు : బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) విమర్శించడమే కాకుండా, 2020 ఢిల్లీ అల్లర్లలో ముస్లింలపై ‘‘మారణహోమం’’ అని వ్యాఖ్యానించారు. ఈ అల్లర్లతో భారత్ ఇస్లామిక్ దేశాల్లో ఒంటరి అవుతుందని హెచ్చరించారు. అతివాద హిందువుల్ని ఎదుర్కోవాలని పిలుపునివ్వడం గమనార్హం. దీనికి ప్రతిగా భారత్ స్పందిస్తూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని చెప్పింది.
*గాజాతో పోలిక: 2024లో భారత్ను మయన్మార్, గాజాతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు తప్పుడు సమాచారం ఆధారంగా, అంగీకారయోగ్యం కానివని భారత్ అభివర్ణించింది.
ఇరాన్పై భారత ప్రభుత్వ వైఖరి:
ఇరాన్ భారత్కు మిత్రదేశమైనప్పటికీ పలు సందర్భాల్లో ఇరాన్కు వ్యతిరేకంగా ఓట్ వేసింది. 2005, 2006,, 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం కోసం అమెరికాకు మద్దతుగా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)లో మూడుసార్లు ఇరాన్కు వ్యతిరేకంగా ఓటు వేసింది. 2022లో ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో తటస్థంగా ఉంటూ, ఓటింగ్కు దూరంగా ఉంది.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!