భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంజయ్ కిశోర్ ఈ పుస్తకాన్ని సేకరించి, రచించి, రూపకల్పన చేశారు.
ఓరుగల్లుకు ఓ చరిత్ర ఉందని, విజ్ఞాన ఖనిగా ఓరుగల్లుకి పేరుందని.. ఆ పేరు నిలబెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని నార్సింగి ఓం కన్వెన్షన్ లో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం కార్యక్రామానికి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మనిషికి శ్వాస ఎంత అవసరమో.. భాష కూడా అంతే అవసరం అని నొక్కి చెప్పారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. విజయవాడలో జరుగుతోన్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వెంకయ్యనాయుడు.. ఇక, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కొలకలూరి ఇనాక్, లావు అంజయ్య చౌదరి, పలువురు ప్రముఖ రచయితలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మనిషికి శ్వాస ఎంత అవసరమో భాష కూడా అంతే…