Venkaiah Naidu: ప్రజల ఆలోచనతో విప్లవం రావాలి.. బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్లో మార్చేయాలి..
Venkaiah Naidu: తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో తెలుగు జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. ప్రజా సభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి, పత్రికా రంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి, ఈ ధోరణి దేశ గౌరవానికి ముప్పు అని హెచ్చరించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
ఇక, విద్యా, వైద్య రంగాలు వ్యాపారం అయిపోయాయి.. అనవసర పరీక్షలతో వైద్యం రాద్ధాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. రాజకీయాల్లో ఉండే శక్తులు విద్య ,వైద్య రంగాలలో ప్రవేశిస్తున్నారు.. రాజకీయ రంగంలో వ్యాఖ్యలు జుగుప్త్సా కరంగా తయారయ్యాయన్నారు.. అయితే, బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సిద్ధాంతం నచ్చక పోతే పార్టీ మారొచ్చు.. కానీ, పదవి కోసం పార్టీలు మారుతున్నారంటూ వ్యాఖ్యానించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్తో భేటీ..
మరోవైపు.. ఈ రోజు ఉదయం విజయవాడలోని SSS పాక హోటల్ లో ఇడ్లీని తిన్నారు వెంకయ్యనాయుడు.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచించారు.
ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. pic.twitter.com/GJVZDaMn0I
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 2, 2023
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!