Venkaiah Naidu: కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి
దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బ్రిటీష్వాళ్లు మన సంపద దోచుకొని పోయారు.. మన సంస్కృతిని నాశనం చేసి, వారి సంస్కృతి రుద్దేసి వెళ్లిపోయారు.. మాతృభాష కళ్లు లాంటిది, పరాయి భాష కళ్లద్దాల్లాంటివన్నారు వెంకయ్యనాయుడు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ నేతలు, ప్రజలు. గత ఐదేళ్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Read Also:Minister Roja: కుప్పంలో చంద్రబాబు దొంగఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు
Also Read
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మహా హారతి కార్యక్రమం చోటు సంపాదించుకుంది. కార్యక్రమ ప్రాంగణంలో భారతమాత భారీ విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. త్రివర్ణ పతాక రంగుల్లో భారీగా హాజరైన విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది హుస్సేన్ సాగర్ తీరం. దేశ భక్తిని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. మనమంతా ఒక్కటే అనే భావన ఈ కార్యక్రమం తెలియజేస్తుంది..
ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారతమాత వీరులను కన్నది.. శాంతి కోసం పోరాడేయోధులను భారతమాత కన్నది.. మన దేశం ఎప్పుడూ విద్వేషాలను రెచ్చగొట్టలేదు..దేశ విస్తీర్ణం కోసం మనమేనాడు పోరాటం చేయలేదు.. శాంతి కోసం చేశాం. బ్రిటిష్ వారు మన సంపదను దోచుకుని.. అనేక విధాలుగా నాశనం చేసి వెళ్లిపోయారు..మనం సోదరభావంతో మెలిగినప్పుడే భారతీయులం..మన చరిత్ర వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్యనాయుడు. వాస్తవ పరిస్థితులు అంటే రాజకీయాలు కాదు.. మహనీయుల చరిత్రలు..
యువతకు మహనీయుల చరిత్రలను తెలియజేయాలి.. వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి. దేశాన్ని ఏకం చేసేదే మహా హారతి.. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి నా అభినందనలు. విద్యార్ధినీ, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అన్నారు వెంకయ్యనాయుడు.
Read Also: Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!