Rajinikanth on Politics: రాజకీయాల్లోకి ఎందుకు రాలేదంటే… ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth comments on Political entry: రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయం పై క్లారటీ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పొలిటికల్ ఎంట్రీకి దాదాపు రెడీ అయ్యాను. అయితే అదేటైంలో కరోనా (Covid) వచ్చిందన్నారు. రాజకీయాల్లో రావాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారు …ప్రజలను కలిసే సమయంలో పది అడుగుల దూరం ఉండాలి,మాస్క్ వేసుకోవాలని అన్నారు. ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్ ఎంట్రీ పై ఆలోచించి అడుగు వేయాలన్నారు..అప్పటికే కిడ్నీ సమస్య ఉండటం …దానికి తోడు కరోనా వైరస్ తీవ్రమైన ఉన్న జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదన్నారు..రాజకీయాల్లో రజనీకాంతరావు రావడానికి భయపడ్డాడు అన్నారు. రాజకియాల్లో రాకపోవడానికి అసలు నిజం నా ఆరోగ్యం సహకరించకపోవడమే అని అసలు సంగతి చెప్పేశారు.
Also Read
రజనీకాంత్ రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారనేది ఇప్పటికీ చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. తాజాగా రజనీకాంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఊరట నిస్తాయేమో చూడాలి. తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని రజనీకాంత్ చెప్పడంతో ఆయనపై విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పినట్టు అయిందంటున్నారు విమర్శకులు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాలంటే తనకు భయమనీ అంతా అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు.
Honoured to be at the Silver Jubilee celebrations of Sapiens Health Foundation, along with my friend, superstar Rajinikanth. Pleased to launch the Foundation’s initiative, “Decrease salt, Increase life.” pic.twitter.com/XuxY44yeRH
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 11, 2023
శరీరంలోని వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందని, రక్తాన్ని మానవులెవరూ తయారు చేయలేరని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. దేవుడున్నాడు అనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. దేవుడు లేడు అనేవారు కనీసం ఒక బొట్టు రక్తాన్నైనా తయారుచేసి చూపించాలని రజనీకాంత్ సవాల్ చేశారు. ఇదిలా ఉంటే వెంకయ్కనాయుడికి ఉప రాష్ట్రపతి ఇవ్వడం తనకు నచ్చలేదని కామెంట్ చేశారు రజనీకాంత్. అయితే రజనీకాంత్ ని తాను రాజకీయాల్లోకి రావొద్దని హితవు పలికానన్నారు వెంకయ్యనాయుడు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని తెలిపారు.
Read Also:ED: లాలూ అక్రమ సంపాదన రూ.600 కోట్లు.. రూ.150 కోట్ల భవనాన్ని 4 లక్షలకే కొనుగోలు..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!