Venkaiai Naidu : పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలన్నారు భారతమాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయడు. విశాఖ ఐటీ హిల్స్లో కార్పొరేట్ బిజినెస్ కాన్ క్లేవ్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ హెడ్స్ కనెక్ట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షేర్ అండ్ కేర్ అనేది భారతీయ తత్వమని, సంపద సృష్టించాలి…దాన్ని పంచడంలో వుండే ఆనందాన్ని కూడా పొందాలన్నారు. సంపద పెంచుకోకుండా పంచుకుంటూపోతే అప్పులకు వడ్డీలు కట్టాలని ఆయన అన్నారు. అవసరార్ధులకు చేయి అందించాలి.. భుజం ఎక్కించి మోయకూడదని ఆయన అన్నారు.
Also Read : Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు
Also Read
మూడో అతిపెద్ద ఆర్ధికశక్తిగా భారత్ అవతరిస్తుందని, ప్రకృతిపరిరక్షణ పైనే భవిష్యత్తు ఆధారపడి వుందన్నారు వెంకయ్య నాయుడు. సహజవనరులను , నదులను, జలవనరులను దెబ్బతీసుకోవడం మంచిదికాదని ఆయన అన్నారు. ప్రకృతి ని పరిరక్షించడంలో పారిశ్రామిక వేత్తలే ముందుండాలన్నారు. నైతిక విలువలు, వ్యాపారంలోనూ , రాజకీయాల్లోనూ కనుమరుగవుతున్నాయని, G-20 ఫోరం పర్యావరణాన్ని కాపాడేందుకు , సమాజహితానికి సహకరించుకునేందుకు దోహదపడాలన్నారు. ట్రెండ్ సెట్టర్లు గా మన వాళ్లు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని వెంకయ్య నాయుడు అన్నారు.
Also Read : Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!