రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం అని హోంమంత్రి చెప్పుకొచ్చారు. ‘రాష్ట్రంలో మొత్తం 16,862…
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాలలో…
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు హోంమంత్రికే స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం చైర్మన్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో హోంమంత్రి అనిత సమావేశం అయ్యారు. ఉపమాకలో ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని చైర్మన్ బీఆర్ నాయుడిని హోంమంత్రి అనిత…
Srikalahasti: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక, కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు.
గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు..
టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనుంది. ఏపీలో మహిళల ఉచిత…
Vangalapudi Anitha: విజయనగరం జిల్లాలో నకలీ ఐపీఎస్ అధికారి గురించి ఎన్టీవీలో ప్రసారమైన వార్తలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ వార్తపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించారు. అలాగే, వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మన్యం పర్యటనలో భద్రతా లోపం గుర్తించడంతో.. ఈ విషయం గురించి హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన బలివాడ…